MuralidharRao : మురళీధర్రావుకు ఏసీబీ షాక్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్:తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది.
కాళేశ్వరం అవినీతి కేసు: మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో మురళీధర్రావు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతి, అవకతవకల్లో ఆయనది కీలక పాత్ర అని ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఇప్పటికే ఇరిగేషన్ శాఖలోని అవినీతిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. విజిలెన్స్ శాఖ క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన 17 మందిలో మురళీధర్రావు కూడా ఉన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మురళీధర్రావు గతంలో విచారణకు హాజరయ్యారు.
వాస్తవానికి, మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే ఈఎన్సీ జనరల్గా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన కొంతకాలం పదవిలో కొనసాగారు. అయితే, మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఆయనను తొలగించింది.
Read also:Health News : అధిక ఉప్పుతో అనర్థాలు: గుండె ఆరోగ్యంపై ప్రభావం
