Chandrababu : సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు పర్యటన: పెట్టుబడులే లక్ష్యం:సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన (జులై 29, మంగళవారం) కూడా అత్యంత బిజీగా కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన (జులై 29, మంగళవారం) కూడా అత్యంత బిజీగా కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ హ్సియెన్ లూంగ్లతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అలాగే, ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సింగపూర్లోని వివిధ ప్రాంతాలను సందర్శించనుంది.
డిజిటల్ నైపుణ్యాలు & గూగుల్ క్లౌడ్ చర్చలు
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు, యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు.ఉదయం 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు.
పారిశ్రామిక సమావేశాలు
- మురాటా ఎలక్ట్రానిక్స్ (ఉదయం 8 గంటలకు): మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచశ్రేణి కంపెనీ అయిన మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుపుతారు.
- క్యారియర్ (ఉదయం 8:30 గంటలకు): ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థ అయిన క్యారియర్ ప్రతినిధులతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరుపుతారు.
- విల్మర్ ఇంటర్నేషనల్ (ఉదయం 9 గంటలకు): ప్రపంచంలోని అతిపెద్ద అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై సీఎం చర్చించనున్నారు.
బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశం
ఉదయం 9:30 గంటలకు షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్టేబుల్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్… వంటి థీమ్లపై చర్చిస్తారు. ఎస్టీటీ జీడీసీ, కాంటియర్ సిస్టమ్స్, ఆరియన్ప్రో, ఆంకోషాట్, వాటర్లీప్, జీటీఎఫ్ఎన్, ఫాథమ్ ఎక్స్, ఏస్ డాట్ ఎస్జీ తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.
ఉన్నతస్థాయి భేటీలు
- సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం (మధ్యాహ్నం 12 గంటలకు): ఏపీకి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సింగపూర్ భాగస్వామ్యం అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
- సింగపూర్ మాజీ ప్రధాని లీ హ్సియెన్ లూంగ్ (మధ్యాహ్నం 1 గంటకు): పారదర్శక పాలన, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో సింగపూర్ అనుభవాన్ని రాష్ట్రానికి అందించడంపై చర్చిస్తారు.
పారిశ్రామిక సందర్శనలు & ఇతర సమావేశాలు
మధ్యాహ్నం 2:45 గంటలకు ముఖ్యమంత్రి, మంత్రుల బృందం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సందర్శించనుంది. పారిశ్రామిక వాడల్లో నివాస ప్రాంతాలు, లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహన తయారీ రంగం, ఆటోమొబైల్ పార్కులపై చర్చిస్తారు.
చివరగా, బిజినెస్ నెట్వర్కింగ్పై ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పెట్టుబడులపై సీఎం చర్చించనున్నారు.
Read also:OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్
