Telangana : తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు:తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: స్పీకర్కు 3 నెలల గడువు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలను నేరుగా న్యాయస్థానమే అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్’ అన్న సూత్రం వర్తించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ను కోరింది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్పీకర్ను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా, హైకోర్టుకు తనను ఆదేశించే అధికారం లేదని స్పీకర్ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇస్తూ, తాము స్వయంగా అనర్హత వేటు వేయలేమని, అయితే మూడు నెలల్లోగా స్పీకరే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Read also:Ghaziabad : వరద నష్టానికి మున్సిపల్ కార్పొరేషన్పై మెర్సిడెస్ యజమాని దావా
