Mumbai Rains : ముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి:రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు.
వణిజ్యముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి
రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జరిగిందని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. విఖ్రోలిలోని జన్కల్యాణ్ సొసైటీలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కసారిగా ఇంటిపై కొండచరియలు పడటంతో వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో షాలు మిశ్రా, సురేశ్చంద్ర మిశ్రా అక్కడికక్కడే మరణించారు. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని ఆర్తి మిశ్రా, రితురాజ్ మిశ్రాలను రక్షించి రాజావాడి ఆసుపత్రికి తరలించాయి.
శనివారం ఉదయం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గాంధీ నగర్, కింగ్స్ సర్కిల్ వంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపై వరద నీరు చేరడంతో నగరంలో జనజీవనం స్తంభించింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై, రాయ్గడ్ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు సూచించారు. సహాయం కావాలంటే 100, 112, 103 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది. అత్యవసర సాయం కోసం 1916కు ఫోన్ చేయాలని కోరింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాలను పూర్తిగా తొలగించామని, ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించామని అధికారులు వెల్లడించారు.
Read also:USA : భారత్పై ఆంక్షల విషయంలో ట్రంప్ వైఖరిలో మార్పు: పుతిన్తో చర్చల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు
