ఉద్యోగాల పేరుతో మోసాలు: సైబర్ నేరగాళ్ల వలలో యువత:ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసే నేరగాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యావంతులైన యువకుల ఆశలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఉద్యోగాల పేరుతో మోసాలు
ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసే నేరగాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యావంతులైన యువకుల ఆశలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, మెదక్ జిల్లాలో ఒక యువకుడు ఇలాంటి సైబర్ మోసానికి బలయ్యాడు.
మెదక్ జిల్లాలోని రామాయంపేటకు చెందిన ఒక యువకుడు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగం కోసం ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక ప్రకటన చూసి మోసపోయాడు. కొద్ది మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడితే ఉద్యోగంతో పాటు లాభాలు కూడా వస్తాయని సైబర్ నేరగాళ్లు అతన్ని నమ్మించారు. దీంతో ఆ ప్రకటనకు ఆకర్షితుడైన ఆ యువకుడు, వారి మాటలు నమ్మి విడతల వారీగా మొత్తం రూ.2 లక్షలు చెల్లించాడు. చివరికి మోసపోయానని గ్రహించి ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read also:Patna : పాట్నాలో భారీ వర్షాలకు కూలిన ఫ్లైఓవర్
