-
-
తన పెళ్లిపై స్పందించిన నటి అమీషా పటేల్
-
తాను డేటింగ్ చేసిన వారిలో నిజాయతీ లోపించిందని వెల్లడి
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు
గతంలో తాను చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే వారిలో ఎవరి దగ్గరా నిజాయితీ కనిపించలేదని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవితంలో చాలా మందితో ప్రేమాయణం నడిపాను. కానీ ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదు” అని ఆమె తెలిపారు.
ఆమె మాటల్లోనే చెప్పాలంటే, “అందరూ నన్ను ఒక స్త్రీగా నా శరీరాన్ని మాత్రమే చూశారు. నా ఆలోచనలకు, నిర్ణయాలకు గౌరవం ఇవ్వలేదు.” తన మనసును అర్థం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూశానని, అందుకే ఆ సంబంధాలు పెళ్లి వరకు వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు.
పెళ్లిపై నమ్మకం, భవిష్యత్తుపై ఆశ
అయితే, తనకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని అమీషా తెలిపారు. “నాకు పెళ్లిపై నమ్మకం పోలేదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా మూడు ముళ్లు వేయించుకుంటాను” అని ఆమె అన్నారు. అంతేకాక, పిల్లల్ని కని, కుటుంబాన్ని ప్రారంభించాలని ఉందంటూ తన మనసులోని మాటను ఆమె బయటపెట్టారు. ప్రస్తుతం అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Read also : Bengaluru : బెంగళూరులో నడిరోడ్డుపై అమానుషం: చీరలు దొంగిలించిందన్న ఆరోపణతో మహిళపై కిరాతక దాడి!
