-
20 మంది ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ గార్డులుగా నియామకం
-
నియామక పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
-
ట్రాఫిక్ విభాగం తర్వాత మెట్రో భద్రతలోనూ అవకాశం
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సాధికారతకు కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దీనిలో భాగంగా, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో 20 మంది ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు కల్పించారు. మంత్రి స్వయంగా వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మెట్రో రైల్లో భద్రతా సిబ్బందిగా నియమించామని వివరించారు. ఈ నిర్ణయంతో వారు మెట్రో రైళ్ల భద్రతా విధుల్లో భాగం కానున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ట్రాన్స్జెండర్లు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని మంత్రి ఆకాంక్షించారు.
Read also : Google : గూగుల్ AI విభాగంలో 200 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
