- 50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు
- ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ
- మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో అధికారులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించి విచారిస్తున్నారు.
మొదటి రోజు విచారణ మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు మిథున్ రెడ్డిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ముఖ్యంగా రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము ఆయన కుటుంబీకులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించారు. అయితే, మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని సమాచారం.
రెండో రోజు విచారణ అధికారులు రెండో రోజు శనివారం కూడా మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపరిచి, తిరిగి జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంది.
Read also : USA : ట్రంప్ నిర్ణయంతో భారత్కు టర్బోఛార్జ్: అమితాబ్ కాంత్
