Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

175 కి 175 స్థానాల్లో టీడీపీ  విజయకేతనం ఎగురవేయాలి చంద్రబాబు నాయుడు.

0

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో “భవిష్యత్కు గ్యారెంటీ”పై బస్సు యాత్ర, ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు  మాట్లాడుతూ  మనస్సాక్షి లేని సైకో  జగన్ రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇంతటి అవినీతి, నేరస్థుల పాలన నా రాజకీయ జీవితంలో చూడలేదు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా  ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లాం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం నాయకులుగా మన బాధ్యత అని అన్నారు.

 

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యకర్త ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నాడు. నేను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మిగులు విద్యుత్ సాధిస్తే జగన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాడు. కరెంటు చార్జీలు పెంచకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గించాం. జగన్ రెడ్డి నాలుగేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు. మార్కెట్లో యూనిట్ రూ. 10 పెట్టి కరెంటు కొంటున్నారు. మీటర్ల నుంచి సోలార్ ప్లాంట్ల వరకూ అంతా అవినీతే. ధరలు పెరిగి ఆదాయం తగ్గడానికి అసమర్థ ముఖ్యమంత్రే కారణం. దీపం పథకం తో నాడు సిలిండర్లు ఇస్తే నేడు జగన్ వంట గ్యాస్ ధరలు పెంచేశారు. భూముల ధరలు ఇంతలా పతనం కావడానికి జగన్ రెడ్డి కారణం కాదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి దోచుకుతింటున్నారు.

 

రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి అవినీతికి పాల్పడుతున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు. మహిళలు ప్రజా సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకూ వెనకాడటంలేదని అన్నారు.
మద్యపాన నిషేదం పేరుతో మాయమాటలు చెప్పి జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్లు తానే కట్టించానని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నివాస యోగ్యమైన ఇళ్లను నేను కట్టిస్తే జగన్ రెడ్డి సెంటు భూమిలో ఇల్లు పేరుతో మోసం చేస్తున్నాడు. గంజాయి పెరిగిపోయిందని ఢిల్లీకి వెళ్లి మనం చెబితే మన కార్యాలయంపై దాడి చేశారు.

 

ప్రతిపక్ష కార్యాలయాలు, అధ్యక్షుడిపై దాడులు చేస్తే భయపడతారని భావించారు.
జగన్ రెడ్డికి  ముఖ్యమంత్రిగా చేసే అర్హత ఉందా? రాష్ట్రంలో ఎక్కడ చూసిన బ్లేడ్ బ్యాచ్, గన్ కల్చర్ చెలరేగిపోతున్నారు. రూ.40వేల కోట్ల ఆస్తులను గన్ చూపించి బెదిరించి లాక్కున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్ని ఇంట్లో గృహ నిర్భందం చేసి డబ్బులు ఇవ్వమని గంజాయి తాగుతూ హింసించారని ఎంపీ కొడుకు స్వయంగా చెప్పారు. వైజాగ్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేక ఆ ఎంపీ హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారంటే జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? జగన్ రెడ్డి చేసిన తప్పుడు విధానాలే ఆయన పాలిట శాపాలుగా మారతాయి.

 

సత్యసాయి జిల్లాలో రూ.12 కోట్ల ఆస్తి బలవంతంగా కబ్జా చేసి రాయించుకుంటే ఎవరూ సాయం చేయక ఆత్మహత్య చేసుకున్నారు. మచిలీపట్నంలో ఆవుల సతీష్ అనే వైకాపా నాయకుడు అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఊరుకో వైసీపీ సైకో తయారయ్యాడు. అందుకే మనం ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు రాబోతున్నాయని నేను ఏనాడో చెప్పాను. జగన్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించిన మీడియాపై అక్రమ కేసులు పెట్టారు.

 

ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. రూ.100 సంపాదిస్తే మరో వంద అప్పు చేసి పేదలకు రూ.20 ఇచ్చి రూ.180 దోచేస్తున్నాడు జగన్ రెడ్డి. యువగళం పథకంతో యువతకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటులో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇచ్చి వ్యవసాయానికి అండగా నిలుస్తాం. ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటిని అందించి, ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం.

 

విభజన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని టీడీపీ పరిష్కరించింది. అదే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక విధానాలు తీసుకొస్తాం. గతంలో పిపిపి మోడల్ లో హైదరాబాద్ అభివృద్ధి చేశాం. ఇప్పుడు పి-4 మోడల్ తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ వ్యయం తగ్గించాం. కానీ జగన్ రెడ్డి వచ్చాక సోలార్, విండ్ ఒప్పందాలు రద్దు చేశారు. రైతులకు సోలార్, విండ్ విద్యుత్తుపై అవగాహన కల్పించి, మెరుగైన విధానాలు అమలు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. బీసీలకు తొలి నుండి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయే.

 

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 24శాతానికి తగ్గించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. సాధికారతతో కూడిన సంక్షేమ పథకాలను అమలు చేశాం. దసరా నాటికి టీడీపీ పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తాం. నిర్ధిష్టమైన విధానాలతో బీసీలకు ఏం చేయాలో అవి రూపొందిస్తాం. పూర్ టు రిచ్ నినాదంతో.. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పార్టనర్ షిప్ తో రాష్ట్రాభివృద్ధి చేసుకుందాం. ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ అంటే హేళన చేశారు. ఇప్పుడు అదే విధానానికి డీబీటీ అని పేరు పెట్టి హడావుడి చేస్తున్నారు. దేశ శత స్వాతంత్రోత్సవాల నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుదాం.

 

జగన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పాలన చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. సమర్ధుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్ రెడ్డి వేసే పన్నుల బాదుడుతో ప్రతి కుటుంబంపై రూ.4లక్షల భారం వేశాడు. ధరల నియంత్రణకు తెలుగుదేశం పార్టీ సమర్ధమైన చర్యలు తీసుకుంటుంది. 2014లో ఏపీ లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు.. 2018-19కి రూ.2 వేల కోట్లకు తగ్గించాం. కానీ నేడు జగన్ రెడ్డి అసమర్ధ విధానాలతో రూ.40 వేల కోట్లకు చేర్చారు. సంపద సృష్టించే పోలవరాన్ని నాశనం చేశారు. అమరావతిని అటకెక్కించారు, పరిశ్రమల్ని తరిమేశారు, అభివృద్ధి దూరం చేశారు.

 

రాష్ట్రం ఉత్తర, దక్షిణ కోరియా దేశాల్లా తయారైంది. దేశంలో నంబర్ 1 డ్రగ్ రాష్ట్రంగా ఏపీ తయారైంది. ప్రభుత్వమే విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యపారాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజాచైతన్యంతో ఎంతటి నియంతనైనా ఎదుర్కోవచ్చు. అదే చైతన్యంతో జగన్ రెడ్డి ఎదుర్కోవాలి. 175 సీట్లలో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలి. కుప్పంలో లక్ష మెజారిటీ గెలుపే లక్ష్యం. ప్రజా చైతన్యంతో ఊహించని ఫలితాలు సాధించవచ్చు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ వద్దన్నారు. కానీ పోటీ చేసి బంఫర్ ఫలితాలు సాధించాం. పులివెందుల ఎమ్మెల్సీ గెలిచాం. ఎమ్మెల్యే స్థానం కూడా గెలవాలి.

 

పంచుమర్తి అనురాధగారు రెండుసార్లు అవకాశం కోల్పోయారని ఈసారి అవకాశం ఇచ్చాం. ఈ విజయం సాధించకపోతే రాబోయే ఎమ్మెల్సీ స్థానాలకు ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పాం. కాఫీ ఖర్చు లేకుండా అనురాధ గారిని గెలిపించారు. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అభ్యర్ధులకు అద్భుతమైన ఆయుధాలు అందజేస్తున్నాం. ఆ ఆయుధాలతో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వధ చేయాలి. కౌరవ సభను గౌరవ సభగా మార్చాలి. రాష్ట్రం కోసం ఈ యుద్దానికి ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి.తండ్రిని చంపి తండ్రి లేని బిడ్డను నాకు క్షమాబిక్ష పెట్టమనే జడ్జిని వేడుకునే క్రూరమైన నేరస్తుడు కరకట్ట కమలహాసన్ జగన్ రెడ్డి. చేతగానివాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారు.

 

నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నేను చేసే పనిలో 20 శాతం కూడా జగన్ రెడ్డి చేయలేడు. రాత్రి అయితే పబ్జీ ఆడుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఆయననేమి ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు? పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజాసమస్యలపై అధ్యయనం చేసి పార్టీకి రిపోర్టు ఇవ్వాలి. దాన్ని బట్టి పార్టీ మేనిఫెస్టో తయారుచేస్తాం. రాబోయే ఏడు నెలలు చాలా కీలమైనవి. నేతలందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి. 175 కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలి. రాష్ట్రం కోసం, రాబోయే తరాల మహత్తర భవిష్యత్తు కోసం మనమందరం పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie