విశాఖపట్నం: మణిపూర్ అల్లర్లను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అల్లర్లకు బాధ్యత వహిం చాలని, ప్రధానీ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, పౌర ప్రజాసంఘాల వేదిక, అఖిలభా రత ప్రజాతంత్ర మహిళా సంఘం, మహిళా చేతన సంఘాలు ఆధ్వ ర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్ర మం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ మణి పూర్ లో ఇద్దరు గిరిజన మహిలలను వివస్త్రలను చేసి ఊరేగించడం అం టే..దేశానికే అవమానం అని వ్యాఖ్యా నించారు.
వెంటనే మహిళా కమిషన్ స్పందించి అక్కడి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. గత 79 రోజులుగా రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక చుర్చులు, గ్రామాల ను మరో వర్గం వారు ద్వంసం చేశారనీ తెలిపారు. తక్షణం బాధితులకు రక్షణ కల్పించి, నిందితులను కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు.