జగిత్యాలలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్:జగిత్యాల
జగిత్యాల పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే ప్రజలకు మండు వేసవిలో దాహర్తిని తీర్చేందుకు చలివేoధ్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జగిత్యాల శాసనసభ్యులు డా. ఎం. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పాతబస్టాండ్ ప్రాంతంలో చింత సుధీర్ – రోజా దంపతులు, నిహారిక ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంజీవని చలివేంద్రంను జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకనుగుణంగా ఎండాకాలంలో చలివెంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు.జగిత్యాల క్లబ్ పక్షాన జగిత్యాల పట్టణంలోనీ పలు చోట్ల చలివెంధ్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిలర్, క్లబ్ కార్యదర్శి ముస్కు నారాయణ రెడ్డినీ ఎమ్మెల్యే కోరారు.చలివెంధ్రాలు ఏర్పాటు చేసిన వారికి మున్సిపల్ పక్షాన మిషన్ భగీరథ నీటిని అందిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రజల రద్ది ఎక్కువగా ఉండే పాత బస్టాండ్ ప్రాంతంలో మొదటగా చలివేంద్రం ఏర్పాటుచేసిన చింత సుధీర్, చింత రోజా, నిహారిక,వారి మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక్క నవీన్, ముస్కు నారాయణ రెడ్డి,అడువాలా లక్ష్మణ్, తాజ్, గణేష్,మతిన్, వంశీ, అజార్, శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.