సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండ జిల్లాలో కాక పుట్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్గా కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదేలే అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఒక వైపు కర్ణాటక ఫలితాలు.. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో.. టీ కాంగ్రెస్లో మరింత జోష్ పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భట్టి పాదయాత్ర ఎంటీ తర్వాత రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. నల్గొండ అభివృద్ధి, బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై భట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నల్గొండ జిల్లాలో తన పాదయాత్రలో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు భట్టి విక్రమార్క. కేంద్ర విచారణ సంస్థల నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారనీ భట్టి ఆరోపించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే లొంగిపోయి లాలూచీ పడడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అడగలేక పోయారనీ విమర్శించారు.పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాటలను జనం నమ్మే స్థితిలో లేరని ఆయన విమర్శించారు. BRSను శంకరగిరి మాన్యాలకో, బంగాళా ఖాతంలోనో పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనీ అన్నారు.
బీఆర్ఎస్ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారని, వారికి సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేసేందుకు యత్నిస్తున్నారని భట్టి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై గుత్తా, సుఖేందర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డిలకు సోయలేదన్నారు. భట్టీ కామెంట్స్ బీఆర్ఎస్లో కాకరేపాయి. ఆయన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్లగొండలో జరిగిన విద్యాదినోత్సవం సంబరాల్లో పాల్గొన్న జగదీశ్రెడ్డి.. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే క్షమాపణ
అమ్మాయి చదవుకుంటే.. అన్నీ అవే ఇస్తాయి..
చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జరిగిన అభివృద్ధిని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమన్నారు.మొత్తంగా.. కర్ణాటక గెలుపు తర్వాత జోష్ మీదున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఐతే..తెలంగాణ అవతరణ దినోత్సవాల జోష్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో నల్గొండ పొలిటికల్ పిక్చర్ ఆసక్తిగా మారిం