ప్రతి రోజు యోగ చేయడం వల్ల మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.బుధవారం మంథని పట్టణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగను ప్రతి ఒక్కరూ మన దైనందిన జీవితం లో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ప్రతి రోజు యోగ చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
మన సనాతన ధర్మం లో యోగ ఒక అద్భుత సృష్టి అని,మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు యోగ యొక్క ప్రాముఖ్యత ను వివరిస్తున్నారని అన్నారు. మన భారత దేశం లో పుట్టిన యోగ కళ నేడు ప్రపంచమంతట విస్తరించడం మనదేశానికి గర్వకారణం అన్నారు ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్,మంథని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, ఎడ్ల సదశివ్, చీదురాల మధుకర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు దాసరి శ్రవణ్ లు పాల్గొన్నారు.