విశాఖపట్నం ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా కూటమి పనిచేస్తోందని గంటా శ్రీనివాస్ తెలిపారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గంటా వెల్లడించారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కూటమిగా ఏర్పడినట్లు గంటా వివరించారు. ఇవాళ ఆయన భీమిలి మ్యానిఫెస్టోను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మ్యానిఫెస్టోపై మాట్లాడుతూ.. ఇందులో దేనికీ పొంతన లేదని, పాత మేనిఫెస్టోనే రిపీట్ చేశారన్నారు.