ఎపిలో ఉండేది పేరుకే మంత్రులు…ఉన్నారు అంటే ఉన్నారు.. తిట్టడానికి బయటకు వస్తారని విమర్శించారు. దేశంలో ఎక్కడ పెరగని ధరలు ఎపిలో పెరుగుతుంటాయి. ఏపిలో ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగానే పనిచేస్తోందని సెటైర్ వేశారు. మద్యం శాఖ మంత్రికి ప్రపంచ స్ధాయిలో అవార్డు ఇవ్వాల్నారు. రిజిస్టేషన్ ఆపేసి మరి కొత్త జీవో తెచ్చి ఆదాయం పెంచుకోవడానికి చార్జీలు పెంచుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయడంతో పాటు రాష్ట్ర స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు బహిరంగసభలు కూడా నిర్వహించనున్నారు.