శ్రీనగర్
“శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది”ని పురస్కరించుకొని తేదీ 9 ఏప్రిల్, 2024 తేదీన హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు శ్రీనగర్ లోని పురాతన శివాలయమైన విచార్ నాగ్ దేవాలయం మరియు మాతా ఖీర్ భవాని దేవాలయంలో తెలుగు సాంప్రదాయ దుస్తులైన పంచెకట్టు, కుర్తా ఖండువాలు ధరించి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి అనంతరం (మన తెలుగు సాంప్రదాయమైన పచ్చడి లాగా) కాశ్మీరీ సాంప్రదాయంగా ఒక పళ్లెం లో బియ్యం, కలం, పెరుగు, పాలు సమర్పించి “సప్తర్షి పంచాంగం” ఆలకించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ గారు మాట్లాడుతూ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ప్రక్రుతి మన జీవితంతో ముడిపడి ఉన్నాయని, మన ప్రాచీనమైన సంస్కృతిని కాపాడుకోవడమే మన ధర్మమని పేర్కొన్నారు. శ్రీనగర్ లోని స్థానిక కాశ్మీరీ మహిళలతో శ్రీ దత్తాత్రేయ గారు ముచ్చటించినప్పుడు శాంతి భద్రతలు వెల్లువిరుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన పర్యాటకులతో వారి జీవన పరిణామాలు మెరుగుపడుతున్నాయని వారు తెలియజేసారు. అనంతరం శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రసిద్ధమైన “డాల్ సరస్సు”లో పడవ ప్రయాణం చేసి కాశ్మీరీ అందాలు ఆస్వాదిస్తూ సేద తీరడం జరిగింది.