మేడే ఉత్సావాలను విజయవంతం చేయండి
కార్మిక చట్టాలను అమలు చేయాలి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్
జగిత్యాల,
జిల్లా లోని పెగడపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 138 వ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఇరుగురాల భూమేశ్వర్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు.. ఈ సందర్బంగా భూమేశ్వర్ మాట్లాడుతూ 4 లేబరు కోడ్ లు రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు .అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తేవాలి భవన నిర్మాణ కార్మికుల ప్రమాద మరణానికి 10 లక్షలు 5,000 పెన్షన్ చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలని బీడీ కార్మికులకు కనీస కూలి రేటు పెంచి నెలకు 3000 పెన్షన్ చెల్లించాలి…ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా నాయకులు శనిగరపు ప్రవీణ్, ఏఐటీయూసీ మండల కన్వీనర్ రాచర్ల సురేష్, మండల్ నాయకులు ఉప్పులంచ రాము, విలాసాగరం రమేష్, ఆటో యూనియన్ నాయకులు మల్లారపు అంజయ్య, తోడేటి సంజీవ్, భవన నిర్మాణ & పంచాయతీ కార్మికులు అడ్లూరి రాజయ్య, మ్యాక చంద్రయ్య, బొమ్మన శంకరయ్య, కొత్తూరి లచ్చయ్య, బొమ్మన నర్సయ్య అడ్లూరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు..