చోడవరం
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన చోడవరం సిద్ధమేనా. ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కేవలం మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. మనం వేసే ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
అమలాపురంలో వైసీపీ ఫ్లెక్సీల వార్
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే.ఇదీ చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే మళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతున్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతున్నాను. బాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టినట్లే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. పేదలకు జై కొడుతున్న ఓ అవ్వ, ఓ అక్క, ఓ అన్నా.. మీరంతా చెప్పాలి.. ఓ బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్తా గోవిందా గోవింద.. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవింద గురించే. ఈ తిరుపతిలో ఏడుకొండలుపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు ఈ గోవిందా గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ప్రజలు ఎలా చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో చెప్పే గోవిందా గోవింద.