అమలాపురంలో Minister Vishwarup family మంత్రి విశ్వరూప్ కుటుంబంలో ఫ్లెక్సీల వార్ ముదిరింది. మంత్రి కుమారులు వేరువేరుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి విశ్వరూప్ ఫోటో కనిపించలేదు. మంత్రి విశ్వరూప్ కుమారులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శుక్రవారం అమలాపురం సీఎం జగన్ రాకతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ ఆదేశించిన డిజైన్లు కాకుండా సొంత డిజైన్లతో మంత్రి కుమారులు.
ఫ్లెక్సీలు పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రోటోకాల్ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంతో సీఎం పర్యటన పరిశీలకులు తలశిలా రఘురాం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా మంత్రి కుమారులు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొన్న అమలాపురం ఎంపీ అనురాధ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరల ఇప్పుడు మంత్రి కుమారులు సాక్షాత్తు మంత్రి అయిన తండ్రి ఫోటోనే లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జిల్లాలో దుమారం. రేగుతున్నది. సీఎం తన ప్రసంగంలో మంత్రి కుమారుడు శ్రీకాంత్ పేర్కోనడం విశేషం.