తెలంగాణ రాష్ట్రం లో ప్రచారానికి రావడం,ప్రజలని కలవడం అదృష్టం గా భావిస్తున్న… అవకాశం కల్పించిన అధిష్టనం కి ధన్యవాదాలని మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎన్నికల ప్రచారం లో వీలైనన్ని ఎక్కువ స్థానాలలో ప్రచారం చేస్తాను…మెజార్టీ స్థానాలు గెలుస్తున్నాం. ఫలితాల తరవాత తెలంగాణ నుండి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు గా ఉంటారు. సౌత్ చెన్నై లో హోరా హోరీ పోటీ ఉంది..కానీ గెలిచి తిరుతాను. రిజర్వేషన్ అంశం తీసివేసే ప్రసక్తే లేదు.దీని పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది…తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కీ ఎమర్జెన్సీ విధించింది ఎవరు? ఆ సమయం లో బాధితురాలు నీ నేను.ఎమర్జెన్సీ సమయంలో నా తండ్రిని అరెస్ట్ చేశారు అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాము. అలాంటి పార్టీ కి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.