ఎన్టీఆర్ జిల్లా మైలవరం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బైపాస్ రింగ్ వద్ద శాంతి నగర్ లో రోడ్ల ప్రక్కన నిర్మించిన ఇళ్ళను అధికారులు సోవారం కూలగొట్టారు. తాము ఇక్కడే 30సంవత్సరాల నుండి ఉంటున్నామంటూ ఇళ్ళ యజమానులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టా ఇచ్చినా కూలదోస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. అడ్డుకుంటున్న వారిని పోలీసులు నిలువరించారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.