నీట్ – 2023 ఫలితాలలో రెజొనెన్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి ఖమ్మం జిల్లాలోనే అగ్ర గామిగా నిలిచారు. రెగ్యులర్ ఇంటర్మీడియట్ తో పాటే నీట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మొహమ్మద్. నాజియ అంజుమ్ 550 మార్కులు, యస్. దేవిక 513, జి. రమ్య 480 కె.సాయి ఆనంద్ 462, యస్.సాయి నేహ 449, వి. జోషిక 417, బి. వినీల 390 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్స్ ఆర్. వి. నాగేంద్ర కుమార్, కే. శ్రీధర్ రావు లు మాట్లాడుతూ ఇంతటి ఘనవిజయం సాధించడానికి పటిష్ఠమైన ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం,బోధనానుభవం కలిగిన మేనేజ్ మెంట్ ఈ విజయానికి కారణమని అన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ మూలంగానే ఇంతటి ఘన విజయం సాధించామని తెలిపారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులను, అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ సతీష్,ఎం.భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.