మండే ఎండలలో స్కూల్స్ పునః ప్రారంభించడం చాలా దురదృష్టకరం అని ప్రభుత్వం పాఠశాలకు సెలవులు పది రోజులు పెంచాలని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ డిమాండ్ చేసారు. నీట్ యు.జి పరీక్ష లో జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా వాసి బోర వరుణ్ చక్రవర్తి మొదటి స్థానం లో రావడం చాలా గర్వం గా ఉందని అన్నారు. ఎపుడూ చూడని ఈ ఎండలకు బెదిరి, జడిసిపోయి పిల్లలుకు స్కూల్ ఓపెన్ చేసిన బడుల కు పూర్తి స్థాయిలో హాజరు కాకుండా బడికి బంద్ చెప్పారని అన్నారు. ఈ హాజరు సాకు గా చూపించి పిల్లలు కు అమ్మ వడి పధకం ప్రభుత్వం ఆపివేస్తోందో అని తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
నీట్ ఫలితాలలో రెజొనెన్స్ అగ్రగామి
అసమర్ధ పాలనలో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురిఅవుతున్నారని గోరుచుట్టు పైన గొడ్డలి పోటులా ఓ పక్క ప్రభుత్వ పన్నుపోట్లు, ఇతర నిరంకుశ నిర్ణయాలు ప్రజలను తీవ్రంగా వేదిస్తుంటే ఈ సంవత్సరం మండే ఎండలుతో మరింతగా ప్రజలు బేజారు ఎత్తిపోతున్నారని అన్నారు.దానికి తోడుగా వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జిలు భారీగా నెల నెలా పెంచుకుంటూ పోతూ, వేళాపాళ లేని కరెంట్ కోతలుతో షాకుల కొడుతూ ప్రజలుకు నరకం చూపిస్తోందని అన్నారు.ఈ ఎండల ఉగ్ర రూపాన్ని, పరిస్థితిని పెద్దలే తట్టుకోలేక అల్లాడిపోతున్నా రని ఇక చిన్న పిల్లలు ఎలా భరించి పాఠశాలలకు వెళ్లి ఉండగలరని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలకు మరో పదిరోజులు సెలవులు పొడిగించాలని లేని యెడల ప్రజలు బాధలకు, ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెంకటేష్ అన్నారు.