ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి హరీష్ రావు ఫై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోక పోతే వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించరని తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ ఎ .వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పవిత్రమైన తిరుమల లో మైనం పల్లి పాడు మాటలు మాట్లాడారు. మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హన్మంత రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం జీర్ణించుకునే పరిస్థితిలో లేదు. హరీష్ రావు చేస్తున్న ప్రజాసేవలో మైనంపల్లి ది పైసా వంతు కూడా ఉండదని అన్నారు.
Also Read: బీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు
పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించాల్సిన విషయాలను బహిరంగంగా మైనం పల్లి ప్రస్తావించడం క్రమశిక్షణా రాహిత్యమే మైనం పల్లి లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకపోతే పార్టీ అధిష్టానం ఆయన పై చర్యలు తీసుకోవాలి. మైనం పల్లి తన ఇష్టారీతిగా మాట్లాడితే భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. మైనం పల్లికి రాజకీయ పునర్జన్మను ఇచ్చింది బీ ఆర్ ఎస్ యే ..ఈ మాటను మైనం పల్లే స్వయంగా చెప్పారు. .హరీష్ రావు ను విమర్శించడం అంటే బీ ఆర్ ఎస్ ను విమర్శించడమేనని అన్నారు.