రుషికొండను పరిశీలించిన: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
సీఎం జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ నిర్మిస్తాడ అంటూ జగన్ను నిలదీశారు. పోలీసుల ఆంక్షల మధ్య విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగు తోంది. ఎట్టకేలకు ఆంక్షల మధ్య రుషికొండను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారు రుషికొండపై నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా? తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుంది ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైకాపా నేతల కళ్లు పడ్డాయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచు కుంటున్నారు.
తెలంగాణను కూడా ఇలాగే దోచేశారు జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలి? “రాష్ట్ర వ్యాప్తంగా దోచేసాడు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ దృష్టి పెట్టాలి ప్రభుత్వ ప్రవేట్ ఆస్తుల భూములను ప్రజల దగ్గర లకుంటున్నారు. చట్టాలు కాపాడివలసిన ముఖ్యమంత్రి చట్టాలను ఉల్లంగిస్తారు రుషి కొండ నిర్మాణం అంతా పుర్తిగా వైలేషన్ చేసి కట్టారు ఇక్కడ ప్రజలు శాంతి యుతంగా ఉన్న ప్రజల పై దోపిడీ చేయడం జగన్ సర్కార్ అన్యాయం చేస్తుంది మరోసారి ఋషికొండ లో జగన్ పై ఘాటైన విమర్శలు పవన్ చేశారు.