కమాన్ పూర్
మండలంలోని గుండారం పంచాయతీ పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన గరిగంటి ఓదెలు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్, మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా గరిగంటి ఓదెలు కు 60.000/- రూ మంజూరైయ్యాయి. మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును జడ్పిచైర్మన్ పుట్ట మధు గారి ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో రాజాపూర్ లో లబ్ధిదారుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, గుండారం గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, నాయకులు రాచకొండ రవి, ఆకుల గట్టయ్య, బొంతల ఓదెలు, గొడిశెల స్వామి, దండే ప్రదీప్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు ..
Next Post