జగన్ తో జనం ఎక్కడ…. కడప, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Jagan Mohan Reddy జగన్ పులివెందులలో ఉన్నారు.జగన్ చుట్టూ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు వంటి వారు మాత్రమే కనిపిస్తున్నారు. జగన్ వస్తే జనం తండోపతండాలుగా వస్తారు. అందున పులివెందుల వచ్చారంటే ఈ స్థాయిలో వస్తారో తెలియంది కాదు.అయితే ఎందుకు అక్కడ పరిణామాలు మారిపోయాయి.ఇప్పుడు జగన్ వస్తే జనాలు పెద్దగా రావడం లేదు. వైసీపీ శ్రేణులు అయితే కామన్ గా వచ్చి పోతున్నారు. కానీ జిల్లా ప్రజలు మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.గత మూడు రోజులుగా జగన్ పులివెందులలో గడుపుతున్నారు. అయితే జనాలు పెద్దగా రాకపోవడంతో ఆయన గృహం వెలవెలబోతోంది.…
Read MoreTag: AP News
Ketan Desai | ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం | Eeroju news
ఏ ప్రభుత్వం ఉన్నా…. కేతిన్ దేశాయ్ కు మాత్రం తిరుమల, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Ketan Desai పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి కూడా అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి నర్సిరెడ్డికి, జనసేన పార్టీ నుంచి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదాలు వినిపిస్తున్నా. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంలో తెలుగుదేశం పార్టీ, వైసిపి పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత నాడు వైసిపి ఏర్పాటు చేసిన పాలకమండలి రద్దయింది. దీంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పాలకమండలిని ఏర్పాటు చేసింది. చైర్మన్ గా బీ ఆర్ నాయుడు…
Read MoreOne time settlement | వాహానాలకు వన్ టైమ్ సెటిల్ మెంట్ | Eeroju news
వాహానాలకు వన్ టైమ్ సెటిల్ మెంట్ విజయవాడ, నవంబర్ 1, (న్యూస్ పల్స్) One time settlement విజయవాడ బుడమేరు వరదల్లో మునిగిన వేలాది వాహనాలకు పరిహారం చెల్లింపులో బీమా కంపెనీల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వరదలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లింపు మాత్రం కొలిక్కి రావడం లేదు. వాహనాల డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, సెకండ్ హ్యాండ్ వెహికల్ విక్రేతలు కుమ్మక్కై వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో చౌకగా వాహనాలను కొట్టేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని భయపెట్టి, కొర్రీలు వేసి అరకొరగా పరిహారం చెల్లిస్తున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు విజయవాడలో 32 డివిజన్లలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. వరదల్లో వేలాది వాహనాలు నీట మునగడంతో వాటి యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఆటోల వరకు ప్రభుత్వం పరిహారం…
Read MoreYS Vijayamma | కుటుంబకధా చిత్రంలో క్లైమాక్స్ ఏంటీ | Eeroju news
కుటుంబకధా చిత్రంలో క్లైమాక్స్ ఏంటీ విజయవాడ, నవంబర్ 1, (న్యూస్ పల్స్) YS Vijayamma వైఎస్ కుటుంబకథా ఆస్తుల చిత్రంలో రోజుకో విచిత్రం వెలుగుచూస్తోంది. ఇదో డైలీ సీరియల్ లా మారింది. ఎవరి వెర్షన్ వారిదే అన్నట్లుగా సీన్ టూ సీన్ నడుస్తోంది. ఎవరి యాంగిల్ లో చూస్తే వారిదే కరెక్ట్ అనిపించేలా హైడ్రామా రక్తి కడుతోంది. ఇది కచ్చితంగా కుటుంబ వ్యవహారమే అని అనుకోవడానికి వీలు లేకుండా బహిరంగ లేఖలు రిలీజ్ చేసుకోవడం పొలిటికల్ గా ఆసక్తికరంగా మారింది. చివరకు జగన్, షర్మిల తల్లి విజయమ్మ కూడా లేఖ ద్వారా తన వెర్షన్ వెల్లడించారు. తన కూతురి వైపే మొగ్గు చూపారు. జగన్-షర్మిల ఆస్తి పంపకాల మ్యాటర్ కథ క్లైమాక్స్ కు చేరుతుందా.. అంటే ముమ్మాటికీ కాదన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇందులో ట్విస్టులు మామూలుగా…
Read MoreAnantapur | అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు | Eeroju news
అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు అనంతపురం, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Anantapur స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఒక్క పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే మనం పడే టెన్షన్ చెప్పలేనిది. ఎందుకంటే సెల్ ఫోన్ కన్నా అందులో ఉన్న మన డేటా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుత కాలంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సెల్ఫోన్లో భద్రపరుచుకునే స్థాయికి వచ్చేసాం. అందుకే సెల్ఫోన్ చోరీకి గురైందంటే చాలు మనకి ఎక్కడా లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. మీ ఫోన్ పోయిందా ఆన్లైన్లో మీ ఫోన్ కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్…
Read MoreVallabhaneni Vamsi | వల్లభనేని వంశీ మాయం | Eeroju news
వల్లభనేని వంశీ మాయం విజయవాడ, నవంబర్ 1, (న్యూస్ పల్స్) Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ. ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్సీ లీడర్లలో ఒకరుగా పేరు. తెలుగుదేశం పార్టీలో గెలిచి.. తర్వాత జగన్ సైడ్కు చేరిన వంశీ.. అప్పట్లో హాట్టాపిక్గానే మారారు. మాట్లాడే మాట.. తనదైన హావభావాలతో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీవీ డిబేట్లలోనూ ఇతర పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. అదంతా గతం. ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం సాధించాక సదరు నేత బయటకు రావాలంటేనే భయపడుతున్నారట. సొంత నియోజకవర్గానికి ఇప్పటికే దూరమైన వంశీ.. అప్పుడప్పుడూ జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారనే టాక్ నడుస్తోంది.తాజాగా వంశీ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఓ కేసులో హజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన వంశీ.. తన అనుచరులు కొందరితో న్యాయవాదుల వేషం వేయించి రక్షణగా నియమించుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి…
Read MoreRahul Gandhi | నవంబర్ 5న తెలంగాణకు రాహుల్… | Eeroju news
నవంబర్ 5న తెలంగాణకు రాహుల్… విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Rahul Gandhi కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. ఎన్నికల తర్వాత ప్రజలకు దగ్గరగా ఉండాలని భావిస్తోంది. కొత్త కొత్త కార్యక్రమం పేరిట ప్రజల్లో ఉండేందుకు ఆలోచన చేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. పాత పద్దతులను దూరం పెట్టింది. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. ఈ నేపథ్యంలో నవంబర్ ఐదున తెలంగాణకు రానున్నారు రాహుల్గాంధీ.కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కార్ను గద్దె దించాలని ప్లాన్ చేస్తోంది. దానికి ఇప్పటి నుంచే మెల్లగా అడుగులు వేస్తోంది. కేవలం ఎన్నికలకు మాత్రమే వస్తామనే అపవాదును తొలగించే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్గా ‘సంవిధాన్ సన్మాన్ సమ్మేళన్’ కార్యక్రమం పేరిట తెలంగాణకు రానున్నారు…
Read MoreCPI Narayana | వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ | Eeroju news
వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) CPI Narayana ఏపీలో రాజకీయాలు వైఎస్ఆర్ ఆస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు వారాలుగా ఇదే అంశం ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం విజయమ్మ బహిరంగ లేఖతో జరుగుతున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పడినట్లయ్యింది.లేటెస్ట్గా ఆస్తుల వివాదంపై సీపీఐ నారాయణ రియాక్ట్ అయ్యారు. ఆస్తుల వివాదాన్ని ఒక్క సామెతతో సరిపెట్టారాశాయన. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇది అన్నా-చెల్లి వ్యవహారమని, దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు.బయటవాళ్లు దీనిపై అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని, అన్నాచెల్లి ఇద్దరు తెలివైన వాళ్లని, పరిష్కారం చేసుకుంటారన్నారు. ఈ విషయంలో వారికి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అంతవరకు వస్తే విజయమ్మ ఇన్వాల్వ్ అవుతారన్నది తన ఓపీనియన్ గా చెప్పుకొచ్చారు సీపీఐ నారాయణ.…
Read MoreAP | కరవు మండలాల జాబితా విడుదల | Eeroju news
కరవు మండలాల జాబితా విడుదల విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) AP ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవుబారిన పడినట్లు తెలిపారు. అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చాయని ప్రస్తావించారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు కరువు మండలాలను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ…
Read MoreVijayawada | మందుబాబులకు తీపి కబురు | Eeroju news
మందుబాబులకు తీపి కబురు విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Vijayawada ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త బ్రాండ్ల అమ్మకాలు త్వరలో తీసుకొస్తామని చెప్పారువైఎస్సార్సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి. గత ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారని.. తెలంగాణ అమ్మకాలకు,…
Read More