జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్ పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో ఇటీవల వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసుల పట్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం చేబ్రోలు మండలంలోనూ విస్తరిస్తోందని సమాచారం. ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన 45 ఏళ్ల ఆశా వర్కర్ సులోచన జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మరణించారు. ఆమె మృతిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, అందుకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి గుంటూరులోని ఒక ఆసుపత్రిలో మెలియాయిడోసిస్ వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో వైద్య అధికారులు కొత్తరెడ్డిపాలెం గ్రామంపై దృష్టి సారించారు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నలుగురిలో…
Read More