ఈవీఎంలపైనే తప్పంతా… మరి మార్పు ఎప్పుడు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Everything is wrong with EVMs : వైఎస్ఆర్సీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ? . ఇప్పడా పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. 2024 ఘోర ఓటమికి మాత్రం ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు. ఈవీఎంలను విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు మంచే చేశామంటున్నారు. బహిరంగసభల్లో చెప్పినవన్నీ మళ్లీ మళ్లీ చెబుతున్నారు. మేనిఫెస్టోను అమలు చేశామంటున్నారు. కొంత మంది నేతలు సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులుగా ఉన్న ధనుంజయరెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయానికి బాధ్యత…
Read MoreTag: Jagan Mohan Reddy
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం…? | YCP away from assembly meetings…? | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. పార్టీల బలాబలాలు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్ష నేత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అసెంబ్లీలో సీట్లు కూడా చివరి వరుసలో కేటాయించే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడ ఉండాలనేది స్పీకర్ ఇష్టం. అయితే గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్నీ గుర్తు పెట్టుకుంటామని టీడీపీ చెబుతోంది. అంటే.. వైఎస్ఆర్సీపీ సభ్యులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు. తర్వాత ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకున్నారు. తమ అధినేతను, వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు…
Read More