స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు – భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిన రెండు బాయిలర్లు – ఈ ఘటనలో పలువురు మృతి చెంది ఉంటారని అనుమానం – మరికొందరికి తీవ్ర గాయాలు – అర్దరాత్రి స్టీల్ పరిశ్రమ ఎదుట నెలకొన్న తీవ్ర ఉత్కంఠత తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమంలోని రెండు బాయిలర్లు ఒక్కసారిగా పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భారీగా విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో పరిశ్రమలోని పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లలో క్షతగాత్రులను నాయుడుపేట, నెల్లూరు ప్రభుత్వాసుపత్రులకి తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పేలుడు దాటితో…
Read MoreTag: Tirupati
Tirupati Laddu Controversy | దూకుడు పెంచిన సిట్… | Eeroju news
దూకుడు పెంచిన సిట్… తిరుమల, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Tirupati Laddu Controversy తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్టార్ చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.సిట్ అధికారులు నాలుగు టీమ్లుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. నెయ్యి సప్లై చేసిన ఏఆర్డెయిరీ ఫుడ్స్ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు..లడ్డూ తయారుచేసే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. పూర్తి విచారణ తర్వాత సీబీఐ డైరెక్టర్కు సిట్బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు…
Read MoreTrupati | సిట్ వర్క్ షురూ.. | Eeroju news
సిట్ వర్క్ షురూ.. తిరుమల, నవంబర్ 23, (న్యూస్ పల్స్) Tirupati దేశవ్యాప్త సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది. NDDB కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీటీడీ వాదన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది.శ్రీహరి భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఉండే అధికారులపై ఇప్పటికే స్పష్టత కూడా వచ్చింది. ఐదు మంది సభ్యులతో ప్రత్యేక…
Read MoreRK Roja | రోజాకు రియల్ సినిమా.. | Eeroju news
రోజాకు రియల్ సినిమా.. తిరుపతి, నపంబర్ 21, (న్యూస్ పల్స్) RK Roja మాజీమంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారట. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావటంతో… ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్గా రెండున్నర సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్.. రోజాకు టూరిజం, క్రీడాశాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశం ఉన్నా.. రోజా.. తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి గానీ.. ఇటు రాష్ట్రానికి కానీ.. తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట.మంత్రి హయాంలో మేడమ్.. తిరుమలకు దర్శనానికి రావడం.. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తప్ప చేసిందేమీ…
Read MoreTirumala | 2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా | Eeroju news
2, 4 గంటల్లో తిరుమలేశుని దర్శనం… సాధ్యమేనా తిరుమల, నవంబర్ 19, (న్యూస్ పల్స్) Tirumala తిరుమలలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఇది ఎలా సాధ్యమనే విషయాలు పరిశీలిస్తే.. కంకణం విధానం తిరిగి అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అత్యధికులు సామాన్య భక్తులే. వీరికి పెద్దపీట వేస్తామని టీటీడీ నూతన పాలక మండలి చెబుతోంది. అయితే, రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో…
Read MoreBhumana vs Peddireddy | భూమన వర్సెస్ పెద్దిరెడ్డి | Eeroju news
భూమన వర్సెస్ పెద్దిరెడ్డి తిరుపతి, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Bhumana vs Peddireddy ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన మాజీ సీఎం.. రీసెంట్ గానే ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించారు. పార్టీని మళ్లీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాలతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ.. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. ఫ్యాన్ పార్టీని కలవర పెడుతుందట. పార్టీ 2027లోనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తల ముందు గొప్పలు పోతూ.. తమలో విభేదాలు లేవని చెబుతున్నారు. కానీ మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్తులు ఉండే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మళ్లీ మైత్రి…
Read MorePawan Kalyan | ఏపీలో సోషల్ మీడియా వణుకు… | Eeroju news
ఏపీలో సోషల్ మీడియా వణుకు… తిరుపతి, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Pawan Kalyan సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోందిసోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు…
Read MoreAP News | 18న టీటీడీ పాలక మండలి సమావేశం | Eeroju news
18న టీటీడీ పాలక మండలి సమావేశం తిరుమల, నవంబర్ 12, (న్యూస్ పల్స్) AP News తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి తొలి సమావేశం ఈనెల 18న జరగనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అందుకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు.ఈనెల 18న ఉదయం 10.15 గంటలకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన దాదాపు ఐదు నెలల తరువాత ఏర్పడిన టీటీడీ బోర్డు తొలి సమావేశం కావడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశం కోసం అధికారులు అజెండా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు,…
Read MoreTDP | కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి | Eeroju news
కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి అనంతపురం, తిరుపతి, నవంబర్ 11, (న్యూస్ పల్స్) TDP రాయలసీమ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడ్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ముందుగా బావబామ్మర్దులు తమ నియోజకవర్గాల్లో అంతా సెట్ చేసి పెట్టారు. ఏ టైమ్లోనైనా పీఠం తమ వశం చేసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సెగ్మెంట్లోని కుప్పం మున్సిపాలిటీలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ..తమ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అందులో నుంచి మరో కౌన్సిలర్ తిరిగి వైసీపీకి లోకి వెళ్లారు.…
Read More32 Acres Sports Complex in AP | తిరుపతిలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ | Eeroju news
తిరుపతిలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి, నవంబర్ 9, (న్యూస్ పల్స్) 32 Acres Sports Complex in AP ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( శాప్) ఛైర్మన్ అనిమేని రవి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు. సరికొత్త ప్రణాళికలతో రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాభివృద్ధి కోసం నూతన క్రీడా పాలసీ తెచ్చినట్లు వివరించారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించిన నూతన క్రీడా పాలసీలోని పలు అంశాలపై చర్చించారు. అలాగే…
Read More