- డిజిటల్ కి ఇవ్వకుండా సిబ్బంది నిధులు డ్రా చేస్తున్నారని సర్పంచ్ యాకు ఆరోపణ
- ఎంపీడీవో కార్యాలయం అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా -సర్పంచ్ యాకు
తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మామూలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని లేదంటే తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లు జనరేట్ కావడంలేదని మండల పరిధిలోని సూర్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ యాకు ఆరోపించారు. బుధవారం సర్పంచ్ యాకు మాట్లాడుతూ కార్యాలయంలో సిబ్బంది ఏ చిన్న పనికి వెళ్లిన మామూలు ఇస్తేనే పనిచేస్తామంటున్నరని ఇందుకు ఉదాహరణగా జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ₹3000 లంచం అడుగుతున్నారని ఇవ్వని పక్షంలో కుంటి సాకులు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు .కార్యాలయంలో తమ బిల్లులు జాప్యం చేస్తూ అలాగే జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి మామూలు వసూలు చేసే విషయంపై స్థానిక ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయిందని అన్నారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న పీఎంఎఫ్ ఎం నిధులకు సంబంధించిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ల డిజిటల్ కీలను కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉంచుకొని సర్పంచ్ కు తెలియకుండానే నిధులు డ్రా చేస్తున్నారని అన్నారు. ఈఎంఐ లు సిబ్బంది జీతాలని కరెంటు బిల్లుని కార్యాలయ సిబ్బంది నిధులు వాడుతున్నారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉప సర్పంచ్లకు ఫోన్ చేసి సర్పంచులు మీకు తెలియకుండా డబ్బులు డ్రా చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చెప్పి సర్పంచులకు ఉప సర్పంచ్లకు తగాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అలాగే ప్రజావాణిలో లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చానని సర్పంచి యాకు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.