విశాఖపట్నం:విశాఖలో ఇండియా పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్,కియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా డ్రాప్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది.లాసన్స్ బే పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ సన్యాసిరావు,కియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గోన్నారు.నగరంలో ప్లాస్టిక్ 120 మైక్రోన్ తక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగిందని వారు చెప్పారు.ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గోన్న విద్యార్ధులకు ప్లాస్టిక్ నిషేదంపై ఉన్న ప్రాధాన్యతను వివరించారు.