ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న మేయర్ వెంకటేశ్వరమ్మ
మచిలీపట్నం
మేయర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరమ్మ తన ఆకస్మిక తనిఖీలతో హల్ చల్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా నగరంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గురువారం రోజున పలు డివిజన్లలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. శుక్రవారం ఉదయం పలు డివిజన్లలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను పరిశీలించారు. హెడ్ వాటర్ వర్క్స్ తో పాటు ఓహెచ్ఆర్ లను పరిశీలించారు. తాగునీటి సరఫరా, క్లోరినేషన్ ను పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మేయర్ వెంట డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, పలువురు కార్పొరేటర్లు వున్నారు.