Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లాఅండ్ ఆర్డర్ సమస్యగా భూ ఆక్రమణ

0

కాకినాడ

స్థానిక సూర్యారావుపేట పరిధిలో గోడారి గుంట ఏరియాలో సంతన పూరి కాలనీ వద్ద ఉన్న స్థలాన్ని కొంతమంది ఆక్రమణదారుల కబ్జాకు ప్రయత్నించడంతో,దాని ద్వారా ఆ ప్రాంతంలో శాంతిభద్రత సమస్య ఏర్పాడే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలకు వెళితే సంతన పూరి కాలనీ అగ్నికుల క్షత్రియలకు అనాదిగా వస్తున్న సుమారు నాలుగున్నర ఎకరాల భూమి వాళ్ళ అవసరాల కోసం విడివిడిగా గతంలో విక్రయించారు. అందులో భాగంగా 1986లో కొత్త మాధవరావుకు కొంత స్థలం విక్రయించారని తెలిసింది! సదరు మాధవరావు మరణానంతరము ఆయన కుమార్తెలు లింగంపల్లి సరిత వైఫ్ ఆఫ్ సత్యనారాయణ, మువ్వ కృష్ణవేణి వైఫ్ ఆఫ్ శ్రీనివాస వద్ద కాకినాడ వైఎస్ఆర్సీపి నాయకుడైన రాజనాల విజయ సారథి (కన్నా) గత సంవత్సరం కొనుగోలు చేశారు. అయితే నగరంలో సదరు భూమిని ఈ మధ్యకాలంలో కొంతమంది కన్నువేసి దానిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.!ఇందులో భాగంగా ఈ విషయం తెలుసుకున్న సదరు కన్నా కోర్టు నుంచి తనకు అనుకూలంగా  ఉత్తర్వులు తెచ్చుకున్న సరే స్థానిక ప్రభుత్వ అధికారులు సరైన చర్యలు తీసుకోక, నిర్లక్ష్యం వహించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సంతన పూరి కాపురస్తులు ముమ్మసేన అప్పారావు ,మాధాడి జోగేశ్వరరావు, అంగాడి ధర్మారావు, బొడ్డు నూకరాజు, వంతాడ శ్రీను ,మైల అప్పారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్ధానికులు గుమ్మికూడి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగానూ, కన్నాకు అనుకూలంగానూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి అమ్మిన గ్రామ పెద్దలను కొంతమందివ్యక్తులు దౌర్జన్యంగా బెదిరిస్తున్నారని, దొంగ కేసులు పెడతాముంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి సున్నితమైన ఇటువంటి సమస్యను శాంతిభద్ర సమస్యగా మారకముందే దానిని పరిష్కరించవలసిన బాధ్యత ఇటు  ప్రజా నాయకులకు, అటు ప్రభుత్వ అధికారులకు పోలీసులకు ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie