సిరిసిల్లల
ఎమ్మెల్యే కేటీఆర్ మా బాధలు పట్టించుకోవాలని కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి సిరిసిల్ల పవర్లూమ్ ఆసాములు వినతి పత్రం అతికించారు. 22 రోజులుగా పని లేక అవస్థలు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని నిరసనవ్యక్తం చేసారు. తమతో కలిసి పోరాటం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలో ఉంటాను అన్న హామీ ఏమైందంటూ ఆవేదన వ్యక్తంచేసారు. సిరిసిల్లలోని 22 వేల మంది పవర్లూమ్ ఆసాములు కార్మికులను ఆదుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు.
Next Post