విజయ జ్యోతి బద్వేలు పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో శుక్రవారం బద్వేలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ జ్యోతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు
వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెసు అధికారంలోకి రావాలన్నారు ఎమ్మెల్యే వ్యక్తిగా తనను కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మను గెలిపించాలని విజయ్ జ్యోతి కోరారు