ఒంగోలు: ఒంగోలు లో వైకాపా నేతలు ఓటర్లకు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఈ నేపధ్యంలో పులి వెంకటరెడ్డి కాలనిలో వైసిపి నేతలు డబ్బులు పంచుతుండగా 9లక్షలు పట్టుకున్నారు. వైసిపి అభ్యర్థి బాలినేని అనుచరులు రెండు రోజుల నుండి ఓటర్లకు బియ్యం బస్తాలు పంపిణీ చేస్తున్నారు. ఆర్థరాత్రి పులి వెంకట రెడ్డి కాలనిలో 540 బస్తాలు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికార్లు సీజ్ చేసారు. గాంధీ రోడ్డు లో ఓటర్ల పంపిణీకి సిద్దం చేసిన 4వేలకు పైగా బియ్యం బస్తాలు పట్టివేసారు.