చేవెళ్ల
గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మాకు పోటీ బిజెపి పార్టీ అని సంక్షేమం కోరే కాంగ్రెస్, సంక్షేమం కోరని బిజెపి పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.సోమవారం వికారాబాద్ జిల్లా లోని పెద్దేముల్ మండలం గొట్లపల్లి, ఇందూర్, తట్టేపల్లి గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని చేశారని అన్నారు. ఎన్నికలు లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని అన్నారు. ఇప్పటివరకు నాలుగు గ్యారెంటీ హామీలు చేశామని అన్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దానిని ప్రజలందరూ ఆదరిస్తున్నారని అన్నారు. మాకు పోటీ బిజెపి పార్టీ అని సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ అని సంక్షేమం కోరని పార్టీ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. మెజార్టీ ప్రజల నిర్ణయిస్తారని గెలుపు మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Prev Post
Next Post