గంజాయి స్వాధీనం
చిల్లకూరు
చిల్లకూరు మండలం బుధనం టోల్ ప్లాజా వద్ద గూడూరు సెబ్ టీం తనిఖీల్లో తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తిరుపతి జిల్లా పెబ్ అడిషనల్ ఎస్పీ రాజేంద్ర వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని పెబ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రాజేంద్ర మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న గంజాయి మరియు ముద్దాయిలను మీడియా ముందు పెట్టి వివరాలు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా పై నిరంతరం తనిఖీలు సాగుతున్నాయని అన్నారు. శనివారం ఉదయం తణుకు డిపో ఆర్టీసీ బస్సు తిరుపతికి వెళుతుండగా దానిలో మదురై ప్రాంతానికి చెందిన మహేష్ ,ముత్తు అమ్మల్ ,ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 3,20,000 ఉంటుందని వీరికి గంజాయి అమ్మే ముఠా సభ్యుల కొరకు విచారణ చేస్తున్నామని అన్నారు.