గూడూరు
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవి పర్యటన త్వరలో గూడూరు నియోజకవర్గంలో ఉంటుందని ఆమె పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని టిడిపి శ్రేణులు కృషి చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు .గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు .
విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్తత
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 13వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టిడిపి నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకొని వారి నిరసనను వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి 27 రోజులు అవుతుందని నియోజవర్గ పరిధిలోని ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ఆక్రమ అరుస్తూ తెలియజేసే విధంగా కరపత్రాలను అందజేయాలని నాయకులను ఆయన విజ్ఞప్తి చేశారు . తిరుపతి జిల్లా పరిధిలో నారా భువనేశ్వరి దేవి పర్యటన సందర్భంగా గూడూరు పట్టణంలో బహిరంగ సభ ఉంటుందని ఆ సభను టిడిపి శ్రేణులు విజయవంతం చేయాలని ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల టిడిపి అధ్యక్షుడు కిషోర్ నాయుడు , కస్తూరయ్య , చెంచురామయ్య లీలావతి తదితరులు పాల్గొన్నారు .