కోరుట్ల,
బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు అన్నారు..బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని చంద్వా గ్రామంలో జన్మించారు. భారతదేశ నాలుగవ ఉప ప్రధానిగా పనిచేశారని అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెషనల్ క్లాసెస్ అనే సంస్థను స్థాపించి కీలకపాత్ర పోషించారన్నారు. దేశ హరిత విప్లవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారని , భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రాల ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరని వారి సేవలను కొనియాడారు..బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణ తిరుమల గంగాధర్, మండల క అధ్యక్షులు కొంతం రాజం, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చ కవిత, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ ,కౌన్సిలర్లు ఎంబరి నాగభూషణం ,మోర్తాడు లక్ష్మీనారాయణ, నాయకులు చెదలు సత్యనారాయణ, ఆడెపు మధు, శ్రీరాములు, అమరేందర్, మ్యాకల నర్సయ్య, పేట భాస్కర్, నేమూరి భూమయ్య, తునుకి సాయి, చిలువేరి విజయ్, తెడ్డు విజయ్, తదితరులు పాల్గొన్నారు
Prev Post