సికింద్రాబాద్
హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని తాఢ్ బంద్ హనుమాన్ దేవాలయంలో సువర్చల వీరాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి స్వామివారికి యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాలలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, రకరకాల పూలతో సర్వంగా సుందరంగా తీర్చి దిద్దారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఏటా హనుమాన్ విజయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంతోపాటు సకల సదుపాయాలు కల్పించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం గొప్ప విషయమని మల్లారెడ్డి అన్నారు.
Prev Post
Next Post