రంగారెడ్డి
నల్లనీళ్ళు రావడంలేదని అడిగిన పాపానికి మిషన్ భగీరథ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పటేల్ చెర్వు తండాలో చోటు చేసుకుంది.గత కొంత కాలంగా గ్రామస్థులు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు కాగ గ్రామంలో గత నాలుగు నెలలుగా నీటి కోరత ఎక్కువైంది. దీంతో కలెక్టరు కార్యాలయంలోని సంబంధిత అధికారులకు పిర్యాదు చేశాడు గ్రామస్థుడు రవి .మరుసటి రోజు ఎంక్వయిరీ కోసం మిషన్ భగీరథ ఏఈ,గ్రామపంచాయితీ కార్యదర్శి వచ్చి విచారించగా గ్రామస్థులు కొంత మంది నీళ్ళు రావడం లేదని చెప్పారు.అవసరాలకోసం పక్క గ్రామం నుండి డబ్బులు పెట్టి వాటర్ ట్యాంకర్లను తెచ్చుకుంటున్నామని చెప్పడంతో అధికారులతో వచ్చిన వాటర్మెన్ కావాలని గొడవపడి నీళ్ళు అడిగిన పాపానికి రాజు అనే వ్యక్తిపై మంచాల పోలీసు స్టేషన్ లో కేసు పెట్టినట్లు భాధితులు తెలిపారు.
Next Post