హైదరాబాద్ పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో రాజ్యాంగ హక్కు ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్ లను కల్పించాలని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలందరినీ అన్ని రాజకీయ పార్టీలు ఓటు హక్కుగా వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థులను స్తంభింప చేసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పై బీసీల వాటా బీసీలకు కల్పించాలని డిమాండ్ చేసారు. బీసీలకు సహకరించే వారిని ఎన్నుకోవాలని హితవు పలికారు.