పెద్దపల్లి
రాష్ట్ర స్థాయి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లో రాష్ట్ర అద్యక్షుడు మేడి పాపయ్య అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులను రాష్ట్ర,జిల్లా కమిటీల్లో నియామకం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాద్యక్షులుగా కన్నూరి బాబు, పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ గా కొట్టెపల్లి దుర్గాప్రసాద్,మంథని నియోజకవర్గం ఇంచార్జిగా కొయ్యల మొండి ని నియమించినట్లు రాష్ట్ర అద్యక్షుడు మేడి పాపయ్య ప్రకటించారు.ఈ మేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా నియమింపబడ్డ వారికి రాష్ట్ర అద్యక్షుడు పాపయ్య నియామక పత్రాలను అందజేశారు,ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అద్యక్షులు పెరుక నవీన్ మాదిగ,తదితరులు పాల్గోన్నారు.
Next Post