పెద్దపల్లి
ముస్లీంల అభివృద్ది,సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.రంజాన్ మాసం పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణ ముస్లీం ప్రజలకు,పార్టీ శ్రేణులకు స్థాని ఎంబీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తో కలిసి సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయయారు.ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి విజయరమణ రావు,గడ్డం వంశీకృష్ణలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ప్రజలు రాష్ట్రం,దేశం బాగుండాలని ఇప్తార్ దువా చేశారు.అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు.ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అన్ని వేళల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ప్రతి ఒక్కరూ రంజాన్ మాసాన్ని ఘనంగా జరుపుకోవాలని,ప్రతి ముస్లిం కుటుంబం సుఖ,సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.అంతకు ముందు ముస్లిం మత పెద్దలు విజయరమణ రావు,వంశీకృష్ణ కు శలువా కప్పి ఘనంగా సత్కరించారు
Prev Post