ప్రాణాలకు తెగించి గోవులను కాపాడిన నూజివీడు పోలీస్ !
నూజివీడు
నూజివీడు కేంద్రముగా గోవుల కంటైనర్ అడ్డుకున్న నూజివీడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, గో రక్షకులు ఒక కంటైనర్ ను ఆపడానికి ప్రయత్నించారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పెద్దముత్తేవి గోశాల కు తరలిస్తున్న సందర్భంలో హనుమాన్ జంక్షన్ దగ్గర కు రాగానే వెళుతున్న కంటైనర్ ను పోలీసులు అపమని సూచించారు. నడుస్తున్న వాహనం నుంచి డ్రైవర్ బయటకి దూకి పరార్ అయ్యాడు. వెంటనే అప్రమత్తమైన నూజివీడు టౌన్ పోలీసులు కోటేశ్వరరావు , ప్రదీప్ కుమార్ ప్రాణాలకు తెగించి లారీని వెంబడించారు. ని కానిస్టేబుల్ ప్రదీప్ డ్రైవర్ సీట్లో కి వెళ్లి కంట్రోల్ చేసి ప్రక్కన ఉన్న కాలువ లోకి వెళ్లకుండా నిలిపివేసాడు. ఘటనలో 70 కి పైగా ఆవులు ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నాయి.