Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బస్సు యాత్రలో కష్టాలు తెలుసుకున్న జగన్

0

కాకినాడ, 
ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించారు సీఎం జగన్. పేదలకు భరోసా కల్పించి ప్రజల సమస్యలను తీర్చేందుకు సిద్దమయ్యారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం జగన్ మంచి మనసును చాటిచెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే పేషెంట్‎ను కలిశారు. వారి బంధువులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న వారి వాహనం వద్దకు జగన్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చు చేసిన బిల్లులను భద్రపరచాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇలా ప్రతీ సందర్భంలో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie