కరీంనగర్
భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నుండి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ బండి సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పిస్క వెంకటేశ్, బుదారం సదానంద్, బీమని నగేశ్, కొంపల్లి మురళి, గుడ్ల సురేష్ కుమార్, శ్రీధర్, దాసరి వెంకటేశ్, ఆడెపు లక్ష్మణ్, సత్యవికాస్, బలుసాని అనిల్, తుపాకుల రమేశ్, శివపురం శ్రీనివాస్, బోగ కనకయ్య, శ్రీరాం విష్ణు, బూర పవన్, పల్లె ప్రశాంత్ తదితరులు బీజేపీలో చేరారు.
అట్లాగే కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ 31వ డివిజన్ కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత వి.కిశోర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఈరోజు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో వి.నర్సింహరాజు, బి.నవీన్, కె.నాగరాజు, జి.సాయికిరణ్, జి.మణిదీప్, జి.సాయి క్రిష్ణ, జి.సాయి కుమార్, జి.శివ, పి.అంజి, పి.శ్రీనివాస్, ఎండీ.హస్సన్ అన్సార్, టి.నిరంజన్, ఏ.అరుణ్, మీనార్ ఖాన్, వి.రాకేశ్ తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు…
ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుు నారాయణసహా పలువురు నాయకులు సైతం ఎంపీ కార్యాలయానికి వచ్చి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.