Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మా ప్లాట్లను చెరువు కబ్జా చేసింది

0

సంగారెడ్డి
కాయకష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం 20 లే అవుట్లలో కొనుగోలు చేసిన 5 వేల ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ప్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు. 1985 వ సంవత్సరంలో 20 లే అవుట్లలో 5 వేల మందికి పైగా ప్లాట్లను కొనుగోలు చేసినప్పుడు  93.5 ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో 460 ఎకరాలుగా ఎలా మారిందని అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఎసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బడా బాబులు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని, ప్రజా పాలనలోనూ వినతి పత్రం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie